JEE Mains-2025 Session 2 Result out check now
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్(సెషన్-2) ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ రిలీజ్ చేసిన NTA అధికారులు తాజాగా విద్యార్థుల పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకునేందుకు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేయండి. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, అందులో తెలుగువారు నలుగురు ఉన్నారు.
JEE టాప్-10 ర్యాంకర్స్:
JEE ఫలితాలలో రాజస్థాన్ కు చెందిన ఇద్దరు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. మూడు, నాలుగు ర్యాంకులను పశ్చిమ బెంగాల్ కు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
- MD అనాస్ (రాజస్థాన్)
- ఆయుష్ సింఘాల్ (రాజస్థాన్)
- అర్చిష్మాన్ నాండీ (పశ్చిమ బెంగాల్)
- దేవదత్త మాఝి (పశ్చిమ బెంగాల్)
- రవి చౌదరి (మహారాష్ట్ర)
- లక్ష్య శర్మ(రాజస్థాన్)
- కుషాగ్ర గుప్తా (కర్ణాటక)
- హర్ష్ ఏ గుప్తా (తెలంగాణ)
- ఆదిత్ ప్రకాశ్ భగాడే(గుజరాత్)
- 10. దక్ష్ (ఢిల్లీ)
JEE Mains-2025 (Session-2) Result
NTA Press note on JEE Main Session -2 Results CLICK HERE
Thank you for reading... Share this...