AP: Upcoming DSC & TET Updates from Education Minister Lokesh
ఏపీ: డీఎస్సీ & టెట్ గురించి విద్యా శాఖ మంత్రి ఇచ్చిన అప్డేట్ వివరాలు ఇవే
ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది 2026 జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది మార్చిలోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.
మరోవైపు ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం విద్యాశాఖపై మంత్రి నారాలోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా విధానంపై అధ్యయనానికి 78 మంది ఉత్తమ టీచర్లను సింగపూర్ పంపిస్తామన్నారు.
Thank you for reading... Share this...పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి… pic.twitter.com/hXrrwRL3MG
— Lokesh Nara (@naralokesh) October 9, 2025
