3rd December International Day of Persons with Disabilities
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3)
వైకల్యం వైఫల్యం కాదు. తీర్చిదిద్దే వారికి సంకల్పం ఉంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో కూడా ప్రతిభను వెలికి తీయవచ్చు. భావానుగుణంగా స్పందించేలా వారికి తగిన శిక్షణ ఇస్తే 100% లోపాలు ఉన్నా దివ్యాంగ పిల్లలు కూడా విద్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. (3rd December International Day of Persons with Disabilities)
దివ్యాంగ పిల్లల కూడా సమాజంలో ఒక భాగం వారు కూడా అభివృద్ధి చెందినప్పుడే ఏ సమాజమైనా పురోగమిస్తుంది. అలాంటి దివ్యాంగ పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష- భవిత కేంద్రాలను స్థాపించి దివ్యాంగ పిల్లలకు విద్య,వైద్య సేవలు మరియు సదుపాయాలు, మానసిక ఉల్లాసానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతుంది.
వైకల్యం అనేది ఒక సంఘటన మాత్రమే కాని సమస్య కాదు, అంటు వ్యాధి అంతకన్నా కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్య పరచ వలసిన అవసరం ఎంతైనా ఉంది. శిఖరాలను అధిరోహించడంలో, ప్రపంచ ఆధునిక అవిష్కరణలు ఆవిష్కరించి వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి వికలాంగక్యాన్ని సాధించడంలో, ఉన్నత వైకల్యం అడ్డు రాదని నిరూపించిన దశాబ్దం (1983-1992) తరువాత, జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబరు 3 న దివ్యాంగులు మానసికంగా ఆదైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో *”అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం”* ను అంతర్జాతీయ వైకల్యత కలిగిన వ్యక్తుల దినోత్సవం (IDPwD) గా ప్రకటించింది. ఇండియాలో 1992 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్ని రంగాలలో ముందుకుదూసుకెళ్లాలి అనే నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఈ సంవత్సరం (2024) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం యొక్క థీమ్ : “Amplifying the Leadership of Persons with Disabilities for an Inclusive and Sustainable Future”
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు- సహిత విద్య:
జాతి, మతం, కులం, వర్గం, లింగం, సామాజిక లేదా ఆర్థిక వెనుకబాటు వంటి ఎటువంటి భేదభావనలు లేక ప్రత్యేక అవసరాలు గల పిల్లల వైయుక్తిక అవసరాలకు విలువనిస్తూ ఇతర పిల్లలతో కలిపి గుణాత్మక విద్యను అందించే కార్యక్రమమే “సహిత విద్య”.
సహిత విద్య – ఆవశ్యకత:
ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ విద్యలో సమాన అవకాశాలు కలగజేసి వారి వయస్సుకు తగిన తరగతిలో ఇతర పిల్లలతో చదువుకునే వీలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం
సహిత విద్య – ప్రయోజనాలు
సహిత విద్య వల్ల విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న భయాలు తొలగి పోతాయి. స్వేచ్చా మరియు స్నేహ పూరిత వాతావరణం ఇతరులను అవగాహన చేసుకొనుటానికి అవకాశం కల్పిస్తుంది. సహిత విద్య వైకల్యం ఉన్న పిల్లలు, వ్యక్తుల పట్ల ఉన్న వ్యతిరేక భావనను తొలగించి వారి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
సాధారణ విద్యార్థులు ప్రత్యేక అవసరాలుగల అవసరాలుగల విద్యార్థుల పరిస్థితులను, అవసరాలను అవగాహన చేసుకునేలా చేసి వారి ప్రవర్తనలో మార్చు అవసరాలు గల పిల్లల పట్ల అంగీకారము, ఓపిక, గిలా చేస్తుంది. అనగా సాధారణ విద్యార్థులలో ప్రత్యేక నివ్వటం వంటి గుణాలు పెంపొందుతాయి.
-Prepared by B Manalakshmi Naidu garu